నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జండా ఎగుర వేశారు. రిపబ్లిక్ డే పురస్క రించుకుని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.. క్రికెట్, షటిల్, క్యారం, చెస్ పోటీల్లో రన్నర్స్, విన్నర్స్ విజేతలకు బహుమతులు అందించారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ స్పాన్సర్స్ గా వ్యవహరించి విజేతలకు బహుమతులు అందించారు.