కౌలాస్ ఖిల్లాపై మువ్వన్నెల జెండా
NEWS Jan 26,2025 12:54 pm
గణతంత్ర దినోత్సవం సందర్భంగా చారిత్రాత్మక కౌలాస్ కోట మీద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. కౌలాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు.సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన శుభదినాన ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 దేశప్రజలకు సుదినం అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.