ఇంజనీర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 09:33 am
మెట్ పల్లి పట్టణంలో సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను అసోసియేషన్ అధ్యక్షుడు శశి ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గౌతమ్, ఇంజనీర్లు చరణ్, పవన్, మసూద్,సంకీర్త్, సాయికిరణ్, ఇర్ఫాన్, రైమాన్, జాకీర్, వంశీ, ప్రణీత్, శ్యామ్,తదితరులు పాల్గొన్నారు.