ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS Jan 26,2025 09:38 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీ, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.