గణతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS Jan 26,2025 08:57 am
మెట్పల్లి పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సెల్ పాయింట్ యూనియన్ అధ్యక్షుడు బాల్క రాకేష్ జెండా ఆవిష్కరించారు. గౌరవ అధ్యక్షులు సంకు ఆనంద్, ఉపాధ్యక్షులు భాష మాధవ్, కటకం జగదీశ్, వాసిం, ఏలె శివ, కోటగిరి సంతోష్, అజీమ్ , శ్రీకాంత్ తో పాటు యూనియన్ సభ్యులు , స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ విశిష్ట గురించి వక్తలు వివరించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకున్నారు.