వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీలో జనవరి 8న జరిగిన తోపులాటలో మృతి చెందిన కేరళ రాష్ట్రం పాలక్కాడ్ కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని టిటిడి బోర్డు సభ్యులు అందజేశారు. టిటిడి పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టిటిడి బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు.