దావోస్ పర్యటన విజయవంతమైందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తాను 1995 నుంచి దావోస్ కు వెళ్లడం ప్రారంభించానని చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక నుంచి ఎస్ఎం కృష్ణ వచ్చారని తెలిపారు. బిల్ గేట్స్ కూడా ఏపీ కోసం ప్రమోట్ చేస్తున్నారా అని అడిగారని గుర్తు చేశారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా చేస్తున్నానని అన్నారు. దావోస్ లో 27 సమావేశాలలో పాల్గొన్నానని వెల్లడించారు. కంట్రీ స్ట్రాటజిక్ డయలాగ్ అనే అంశం పై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులం పాల్గొన్నామని చెప్పారు.