వైఎస్సార్సీపీకి చెందిన విజయ సాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ వెంటనే ఆమోదం కూడా తెలిపారని వెల్లడించారు . పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్లు చెప్పారు. జగన్ రెడ్డితో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అప్రూవర్ గా మారే ప్రసక్తి లేదన్నారు. వెన్ను పోటు రాజకీయాలు తనకు తెలియవని అన్నారు.