రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే
NEWS Jan 25,2025 08:19 am
రైతులకు బూటకపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు ఆత్మహత్యల అధ్యయన వేదిక కమిటీ చైర్మెన్, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయక పోవడంతో రైతులు అప్పుల భారంతో ప్రాణం తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్నదాతల స్థితిగతులు, ప్రభుత్వ విధానాలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వేసిన అధ్యయన కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది