జాతీయ ఓటర్ అవగాహన సదస్సు
NEWS Jan 26,2025 02:53 pm
కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బాగాంధీ విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మండలకేంద్రంలోని బస్టాండు వద్ద మానవహారంగా ఏర్పడి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు దాని విలువ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వినోద్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, డిటి శ్రీనివాస్, ఆర్ ఐ నగేష్, కార్యదర్శి సాయి, మాజీ ఎంపీటీసీ గసికంటి వేణు లత, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.