మెట్పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హై స్కూల్ లో ముందస్తు గణతంత్ర వేడుకలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో నాటకాలతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ దొంతుల రాజకుమార్, డైరెక్టర్ చర్లపల్లి రాజేశ్వర్గౌడ్, ప్రిన్సిపాల్ విజయకుమారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.