అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి ఆలయ రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికలను టిటిడి జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 3 వరకు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుండి 12 వరకు జరుగుతాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.