మాజీ సీఎం జగన్ రెడ్డికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. నిన్న పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయ సాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. తాజాగా నెంబర్ 3గా పేరు పొందిన ఎంపీ అయోధ్య రామి రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను కూడా వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేపింది. రాంకీ గ్రూప్ నకు యజమాని, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు.