మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో నరేశ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు
పడ్డారు. . స్థానికుల కథనం ప్రకారం.నరేశ్ కుటుంబ సభ్యులు శుభాకార్యం నిమిత్తం ఇంటికి తాళం వేసి మరో ఊరికి వెళ్లడంతో, దొంగలు బీరువా పగలగొట్టి సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, నగదు ను ఎత్తుకెళ్లినట్టు సమాచారం.కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.