వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్మయ పరిచారు. జనవరి 25న శనివారం తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఏ పార్టీ లోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందన్నారు.