మెట్పల్లి: ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ల చేతిలో ఉంటాయని వాహనాలను డ్రైవర్లు అప్రమత్తంగా నడపాలని డీఎస్పీ రాములు అన్నారు. ఆర్టీసీ డిపోలో భద్రత మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన డ్రైవర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాగి వాహనాలను నడపవద్దన్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ దేవరాజం ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.