కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ముగ్గురు ప్రతినిధులను విచారించింది కమిషన్. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై వరుసగా ప్రశ్నలు సంధించారు కమిషన్ చైర్మన్. నిర్మాణంలో నాణ్యత పాటించారా? అని కమిషన్ ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ వంద శాతం పాటించామని సమాధానం ఇచ్చారు సంస్థ ప్రతినిధులు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగిందంటూ నిలదీసింది.