కరీంనగర్ జిల్లాలో శుక్రవారం అధికారికంగా పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. పదే పదే తోసేయడం పట్ల మండిపడ్డారు. మహిళా కలెక్టర్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ అంటూ నిప్పులు చెరిగారు. అసలు ఉండాల్సిన ఎస్పీ ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు కలెక్టర్.