రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ విజయవాడలోని స్పెషల్ కోర్టుకు కేసు నిమిత్తం హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై కేసు నమోదు చేశారు. మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. తమ న్యాయ పరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు నిమ్మల. ఈ సందర్బంగా ఆయనపై అక్రమ కేసు నమోదైంది పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో.