ప్రపంచం విస్తు పోయేలా, ఎక్కడా లేని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. నేలపాడు సమీపంలోనీ అడ్మినిస్ట్రేటివ్ టవర్లు,హై కోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను పరిశీలించారు. కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛంధంగా ఇచ్చారని తెలిపారు. చాలా మందికి నష్ట పరిహారం చెల్లించామని, ఇంకా కొందరికి చెల్లించాల్సి ఉందన్నారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కడతామన్నారు.