నూజివీడు నియోజకవర్గ కన్వీనర్ రామిశెట్టి
NEWS Jan 24,2025 07:58 am
కాపుల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నూజివీడు నియోజకవర్గ కాపు నాయకులు, నూజివీడు నియోజకవర్గం కన్వీనర్ రామిశెట్టి సత్యనారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న రామిశెట్టి సత్యనారాయణ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన నూజివీడు నియోజకవర్గ కాపు నాయకులకు, రాష్ట్ర కమిటీకి, జాతీయ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.