మొగిలిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎమ్మార్వో వీర్ సింగ్ ఆధ్వర్యంలో మొగిలిపేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. అందులో మాజీ సర్పంచ్ చేసిన పనులకు రూ . 18 లక్షల బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో గ్రామ సభలో గందరగోళ పరిస్థితిని నెలకొంది. బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.