మెట్పల్లి 21వ వార్డులో జరుగుతున్న వార్డు సభ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ స్టేజీపై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్ రావు కార్యక్రమానికి వచ్చారు. దీంతో MLA ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం నడుస్తుండగా మీరు ఎలా వస్తారు అని నర్సింగ్ రావును ప్రశ్నించారు. మిమ్మలని కలుద్దామని నేను స్టేజ్ మీదకు వచ్చాను అని జువ్వాడి సమాధానం ఇవ్వడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది.