కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల 33/11 కేవీ సబ్స్టేషన్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తామని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (హెచ్ఆర్డీ అండ్ఐర్) అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిందని ఎవరి నిర్లక్ష్యం లేదన్నారు. ప్రమాదం జరిగిన గంటలోపే సబ్స్టేషన్లో ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టిన అధికారులను అభినందించారు. ప్రమాదంతో రూ.1.50 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు.