దావోస్ పర్యటనలో భాగంగా కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలకు ఏపీ కీలకమైన ప్రాంతంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్బంగా ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తో భేటీ అయ్యారు. తమ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేందుకు కావాల్సిన వసతి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారు కాగ్నిజెంట్ సిఇఓ.