మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని వద్ద 110 గ్రాముల గంజాయి దొరిగిందని సిఐ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్ తెలిపారు.దాస్ నగర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మెట్టు మల్ల శ్రీకాంత్ అనేవ్యక్తి పోలీసులను చూసి పరుగెడుతుండగా వెంబడించి పట్టుకొని విచారించారు. అతని వద్ద 110 గ్రాముల గంజాయి దొరికిందని తెలిపారు.