ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో గతంలో పనిచేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్ ఉషాపై పన్నులు వసూళ్ళలో అవకతవకలలో అభయోగాలు ఆరోపణలపై రాజన్నసిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ డిఎల్ పిఓ విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి పన్నులు వసూలలో అవకతవకలకు పాల్పడ్డారని జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో మెంగని రాజు ఫిర్యాదు చేయగా, గ్రామపంచాయతీలో డిఎల్ పి ఓ నరేష్ విచారణ చేపట్టి రసీదులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకొని పై అధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.