అర్హులందరికీ సంక్షేమ పథకాలు
NEWS Jan 23,2025 10:45 am
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. మెట్పల్లి పట్టణంలోని 2, 8, 20 వార్డులలో జరిగిన వార్డు సభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోహన్, స్థానిక కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు.