ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళా భక్తులతో కిట కిట లాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనం బారులు తీరారు. ఇప్పటి వరకు 9 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేసినట్లు ప్రకటించింది యూపీ బీజేపీ సర్కార్. ఈ సంఖ్య వచ్చే మరింత పెరగనుందని పేర్కొంది. కుంభ మేళా వచ్చే నెల ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా వేసింది.