మంత్రికి జువ్వాడి వినతి పత్రం
NEWS Jan 23,2025 08:36 am
మంత్రి ఉత్తంకుమార్ కు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు బుధవారం వినతి పత్రం సమర్పించారు. రాళ్ళ వాగు నుంచి ఆత్మకూర్ రైతుల కోసం తూము ఏర్పాటు చేయాలని, చెరువులు నింపడానికి వరద కాలువ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్, కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు భూమరెడ్డి, జీవన్రెడ్డి, శేఖర్, దిలీప్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, రాకేశ్ ఉన్నారు.