నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఘటనలో విద్యార్థులంతా సేఫ్ గా ఉన్నారు. నవీపేట మండలం కమలాపూర్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ లోని ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు నాడాపూర్ నుంచి తమ స్కూల్ విద్యార్థులను తీసుకుని నవీపేట్ కు వెళ్తుండగా కమలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో విద్యార్థులంతా సురక్షింగా బయటపడ్డారు.