విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తో లోకేష్ భేటీ
NEWS Jan 23,2025 05:13 am
మంత్రి నారా లోకేష్ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో సమావేశమయ్యారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించమని కోరారు. HCL, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, జోహో, WNS గ్లోబల్ సర్వీసెస్, సియంట్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.