విశాఖలో గూగుల్ ఐటీ సిటీ ఏర్పాటు
NEWS Jan 23,2025 04:54 am
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో గూగుల్ ఐటీ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల వేలాది మంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపింది. ఒప్పందంలో భాగంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ , ప్రభుత్వం తరపున లోకేష్ సంతకాలు చేశారు.