తిరుపతిలో చోటు చేసుకున్న వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. జ్యుడీషియల్ ఎంక్వైరీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది సర్కార్.