రూ. 45,500 కోట్లతో సన్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్
NEWS Jan 23,2025 03:21 am
దావోస్ వేదికగా భారీ ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టనుంది సన్ మెట్రో కెమికల్స్ కంపెనీ. ఇందులో భాగంగా రూ. 45,500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులను నెలకొల్పనుంది సన్ పెట్రో కెమికల్స్.