కోల్ కతా వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసింది. అభిషేక్ శర్మ రెచ్చి పోయాడు. 34 బంతుల్లో 8 సిక్సర్లు 5 ఫోర్లతో 79 రన్స్ చేయగా శాంసన్ 26 రన్స్ చేశాడు. కేవలం 12.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేశారు.