మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు ప్రయాణీకులు పట్టాల పైకి దూకారు. భారీ ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకుంది. కోచ్ ల నుండి బయటకు వస్తుండగా కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టారు. పుష్పక్ ఎక్స్ప్రెస్లో ఉన్న ప్రయాణికులు రైలు బ్రేకింగ్ చేస్తున్నప్పుడు స్పార్క్లను గమనించి పొరపాటున మంటలు చెలరేగుతాయని భయపడ్డారు.