జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ సభలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల ద్వారా అధికారులందరూ క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హుల జాబితా గ్రామసభలో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గ్రామసభ ఆమోదంతో అర్హత పొందిన వారికి ఈ పథకాలు వర్తింపజేస్తామన్నారు.