కలెక్టరుకు ఎమ్మెల్యే వినతి పత్రం
NEWS Jan 22,2025 06:26 pm
కోరుట్ల నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ కు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినతిపత్రం అందజేశారు. ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి రూ.7,500 వ్యవసాయ పెట్టుబడి సాయమందించాలన్నారు. భూమిలేని రైతులకు ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలన్నారు.