కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై రాజారం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, అంబులెన్స్ ను లారీ ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న ఆల్టో కార్ ను వెనుక నుండి బియ్యం లోడుతో ఉన్న లారీ ఢీకొట్టి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను ఢీకొన్నది. అంబులెన్స్లో వున్న పేషెంట్ ను వేరే అంబులెన్స్ లో తరలించారు. ఈ ప్రమాదంలో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. దీంతో కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జామ్ అయింది.