కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయంకు చెందిన వేద పాఠశాల డ్రైవర్ తో పాటు ముగ్గురు వేద విద్యార్ధులు మరణించడంపై మాజీ సీఎం వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.