ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో బిజీగా ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు పక్కన కీ రోల్ లో నటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ప్రముఖ క్షేత్రంగా వినుతికెక్కిన రంగారెడ్డి జిల్లా చిల్కూరు బాలాజీ ఆలయంలో ప్రత్యక్షం అయ్యారు. పూజారులు ఆమెకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.