వైశాలి చారిత్రక స్థూపం అద్భుతం
NEWS Jan 22,2025 05:40 am
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బీహార్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రసిద్ది చెందిన వైశాలి చారిత్రక స్థూపాన్ని సందర్శించారు. స్పీకర్ సతీమణితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు , ఏపీ శాసన సభ వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ కూడా ఉన్నారు. వైశాలి, కొల్హువా లోని విశిష్టమైన చౌద్ద స్థూపాన్ని సందర్శించి శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఏకైక అశోక స్తంభం ఎంతో అద్భుతంగా ఉందన్నారు స్పీకర్.