ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నిర్వాకం పట్ల మండిపడ్డారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల గ్రామంలో 1985 లో 149 ఎకరాలు భూమిని లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మారని అన్నారు. కొన్న వారిలో చిన్నపాటి ఉద్యోగులున్నారని తెలిపారు. డిపీఓను మేనేజ్ చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని ధ్వజమెత్తారు. కోర్టుకు వెళ్లిన బాధితులకు న్యాయం చేయాలని చెప్పినా పట్టించు కోలేదన్నారు.