భరించలేకనే హోంగార్డు ఆత్మహత్యాయత్నం
NEWS Jan 22,2025 04:04 am
నిజామాబాద్ నగరంలో ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై తాడికొండ నర్సయ్య అనే హోంగార్డు అటెంప్ట్ చేసిన సూసైడ్ ను రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. పట్టాల మీద ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేస్తున్నాడని డయల్ 100 కు సమాచారం అందించారు. కంట్రోల్ రూం ద్వార వచ్చిన సమాచారంతో రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి, స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుబేరుడు, కానిస్టేబుల్ రాములు లను అప్రమత్తం చేశారు.