ఆశా వర్కర్స్ ఆందోళన
NEWS Jan 22,2025 04:03 am
ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలని నిజామాబాద్ నగరంలో బోర్గాం బ్రిడ్జి నుంచి వినాయక్నగర్, పులాంగ్ మీదుగా ధర్నా చౌక్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు పాదయాత్ర చేపట్టారు. ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఎన్నికల సమయంలో ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సమ్మెకు సిద్ధమని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. కామారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.