మాజీ ఎంపీపీ నవాబ్ మహిపాల్ గౌడ్ మృతి
NEWS Jan 22,2025 08:57 am
కామారెడ్డి నిజాంసాగర్: పిట్లం మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవాబ్ మహిపాల్ గౌడ్ మృతి చెందారు. పిట్లంకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసముద్రంలో మునిగిపోయారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.