71 సెల్ ఫోన్ రికవరి చేసిన నిజామాబాద్ పోలీసులు
NEWS Jan 21,2025 05:30 pm
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెల్ ఫోన్లు పోయినవారివి 71 రికవరి చేయడం జరిగిందని నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వ రెడ్డి తెలిపారు. 71 సెల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా రికవరి చేసిన మొబైల్ ఫోన్లను బాధిత యజమానులకు అందజేశారు. ప్రతీఒక్కరు వారి సెల్ ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరైనా వారి సెల్ ఫోన్ పోయినట్లయితే వారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పొందుపర్చాలన్నారు.