ఎమ్మెల్సీకి రైతులు వినతి పత్రం
NEWS Jan 21,2025 05:35 pm
రాయికల్ మండలం దావనపల్లి, కట్కాపూర్ గ్రామాల రైతులు దాదాపు 3 వేల ఎకరాలలో వరి పంట సాగుచేస్తూ జీవనాధారం పొందుతున్నామని, తమ పంటలకు సరిపడా నీటి విడుదల చేయుటకు చొరవ తీసుకొని పంటలను రక్షించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రైతులు వినతిపత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు.