ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి అడ్డురి శ్రీరామ్ కు దక్కడం అభినందనీయమని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. పార్టీ బలోపేతం కోసం తొలినాళ్ల నుంచి ఎంతగానో కష్టపడ్డారని కొనియాడారు. అధ్యక్ష పదవి కోసం 15 మంది పోటీ పడ్డారని, చివరకు శ్రీరామ్ ను వరించిందని చెప్పారు. ప్రతి మూడు ఏళ్ల కోసం సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం పార్టీ పరంగా కొనసాగుతూ వస్తోందన్నారు. ఈ జిల్లాలో 900 పోలింగ్ బూత్ లు కమిటీ వేశామన్నారు.